ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై
ఇష్టుల సత్యాగరిష్టత పెంపునకై
నిష్టతో యుగయుగమున
దృష్టముగ జన్మంబొందుచుందుననియెన్
హరి తద్గీతోపదేశంబునన్ .
అటుల మానవాభ్యుదయ పథమే కాంక్షించి
ఎటులైన నవోదయ చైతన్యము కలిగించి
పటుతరముగా తా సత్యప్రమాణములమేరకు
కటువుగ తానాచరించి అనుభవించి
కష్టము గానక మానవ శ్రేణిలో మిళితంబయ్యెన్
మానవ మాత్రునిగా మహినేలి మన్ననలంది
భగవానుడాకృష్ణుడు తానవతారము చాలింప
తన సంకల్ప బలమున తన వంశీకులగు యాదవులు
మునిపుంగవులగు కణ్వ, గాది, నారదాదులు
పిండారకమను పవిత్ర స్థలమందుండగ
జాంబవతి కృష్ణుల సుతుడగు సాంబునికి స్త్రీ వేషంబు ధరింప జేసి
మునుల ముంగిలికేగి ఆ స్త్రీ వేష ధారికేబిడ్డ ప్రసవము కలుగునని
యడుగంగ మునులా విషయము దివ్యదృష్టిన్
గమనించి సాంబునకు ముసలంబు పుట్టునని
అదియె యదువంశ నాశనంబొనరించునని శపియించె.
అటుల ముసలంబుట్టగ దానింగొనిపోయి
సంద్రమునందొక బండపై అరిగింప
దాని అణువుల ప్రభావముతో రెల్లు మొక్కలు మొలిచి
యాదవులందరు వాటితో కొట్లాడి మరణంబొంది
తుదకు ముసలపు సన్నటి ముక్కను సంద్రమునందు విడువ
అదియు అలల తాకిడికి వొడ్డుకు చేరి వేటగానికి అది కనిపించగ
అంబుగ తన విల్లుకు వాడి అలసిన కృష్ణుండు సేద తీరు సమయాన
పొదలలో పక్షియని భావించి గురి చూచి స్వామి బొటన వేలు చీల్చె
అంత పరమాత్ముతన అవతారమును చాలించె
అవ్విధంబుగ అవతార మూర్తియై అష్ట కష్టములననుభవించి
మానవాళితో మమేకమై మహిమాన్వితుడయ్యెన్
పోలూరు బాబురావు, నూజివీడు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి