19, జూన్ 2012, మంగళవారం

స్వధర్మము

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


యుగమునకొక తీరున మానవ మనుగడ యుండగ
కలియుగ మానవ యునికిని విష్ణు పురాణంబందు
ఆ పరాశర, మైత్రేయ సంభాషణమే విశద పరచి
కలియుగ మానవ జీవన పయనము ఎటుల యుండునో తెల్పిరి

కలియుగమున మానవులు మాయా పీడితులై నిర్గుణ
పరమాత్మను తలచు వ్యవధి లేక ప్రాపంచిక విషయాసక్తుల
మునిగి, అవినీతి, అసూయ, ఈర్ష్యలకు లోనై,
"ధనమూల మిదంజగత్" యని భ్రమపడి
నీతి సూత్రములనెల్ల పాటింపక
అధర్మవర్తనులై మెలగుదురనియె.

ద్వాపర యుగాంతమున ఆ శ్రీహరి వైకుంఠము జేర
పరీక్షితుడను రాజు పాండవ పరిపాలకుడాయె.
ఆతడు ధర్మ పరిపాలనము జేయుచుండ
ఒక నాడు వేటకై బోవ, ఆంగీరస మహాముని
తపస్సులో నుండంగ, తన దాహము తీర్చుమని
యడుగంగ ఆతండు మిన్నకుండె!
రాజు కోపోద్రిక్తుడై ఒక చచ్చిన పాము నాతని మెడలో వేసి చనియె.
అంత మునికుమారుడు చూచి ఏడు దినములలో
రాజు మరణము కలుగునని శపియింప ఆ విషయము
తెలియక ఎవరి ధర్మంబు వారు పాటించినట్లైనదని
ముని తన కుమారునకు తెల్పి రాజు ధర్మ పరుడని తెల్పె.

తప్పు చేసిన వాడు తన తప్పు గ్రహించి ఒప్పు చేయుటకు
ఒప్పుకొనుటయే సర్వ ధర్మములోకెల్ల మిన్నయను ధర్మంబునే
ఋషీశ్వరులు ఆశ్రయించిరను విషయము తెలియవలయు.
ఇది పరమ గురుడు చెప్పిన మాట వినుకోరా పామరుడా!


పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి