11, జూన్ 2012, సోమవారం

త్రిగుణాతీతుడు

శ్రీ విఘ్నేశ్వరాయ నమః


కోరుకున్నంతనే కొండంత అండగావున్న
గురువాయూరప్పను తన గురువుగానెంచి
భారతంబందున్న భాగవత పురాణమును
నారాయణీయంబను రమణీయ కావ్యంబుగా
తీర్చిదిద్దుటలో తనకు సహకరించ వేడి
ఆ నారాయణ భక్తి తత్త్వ ప్రాధాన్యతనెరిగి
గురు అనుమతితో అచ్యుతచరిత లిఖించి
నారాయణ భట్టాద్రి భక్త కవివరేణ్యుడాయె!

సృష్టి రహస్యమెరుక పరచు సందర్భాన
పుష్టికరమగు నాద బ్రహ్మ తత్త్వంబు తెలిపి
దృష్టినంతయు ఓంకార నాదంబుపై నిలిపి
సృష్టికాద్యులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులె
త్రిగుణాత్మకతీతులుగా త్రిమూర్తులను
త్రివిధములగు లోకపాలకులుగా కీర్తించెన్
ముజ్జగములకు మూలాధారంబు త్రిగుణతత్త్వమేయని
రజసత్త్వతమో గుణములే మూలమని యెంచి
త్రిసంజ్ఞలగు అ, ఉ, మ లతో కూడిన ఓంకార శబ్దంబు
త్రిమూర్త్యంశ యని తలంచి వేదత్రయంబగు
ఋగ్యజుస్సామవేదములె ఆ ఆదిదేవుని కీర్తింప
అట్టి నిర్గుణ తత్త్వ పరమాత్మ జాగృత్స్వప్నసుషుప్తావస్తలనబడు
త్రివిధావస్తలకతీతునిగా భావించి
భూతభవిష్యద్వర్తమాన కాలాతీతునిగా యెంచి
మూడడుగులతో ముల్లోకములగొల్చి భూ మాతన్ పవిత్రుగావించిన
ఆ త్రివిక్రమ రూపమున్దర్శించినాడు

పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి