24, జూన్ 2012, ఆదివారం

శంకర స్తోత్రపటిమ


ఓం శ్రీ విఘ్నేశ్వరాయై నమః 


ఆర్ష సంస్కృతి అభ్యుదయ పధాన పయనించు వేళ
ఆశ్చర్యకరముగా శంకరుని దయతో కాలడి గ్రామాన
పుణ్య దంపతులకు పుత్రోదయము కల్గి శంకరాచార్య 
నామధేయముతో హైందవ మతోధ్ధరణము చేయ బూని
పిన్నవయసుననే సన్యాసమంది బ్రహ్మచారిగా జీవనక్రియ
ఆచరించు ప్రక్రియలో ఒకనాడు భిక్షాటనకేగి
ఆ యెలనాగ గృహమున్గిట నిలిచి భిక్ష యడుగ
కడుపేదయగు ఆ గృహిణి మరి మరి వెదకి
ఉసిరికాయనొకదానిన్దెచ్చి పాత్రయన్దుంచ 
కుమారశంకరుడదిగాంచి కరుణనుప్పొంగంగ 
ఆ తల్లి పేదరికము బాపుటకై జగజ్జనని 
శ్రీ మహాలక్ష్మినిన్ తలచి
"ఓం శ్రీం హ్రీం క్లీం ఐమ్ సోం శ్రీ మహాలక్ష్మీ నమః"
యని తలచి, కనకధారా స్తోత్రంబు పఠనముచేయ 
మరుక్షణమే ఆ గృహాన కనకవర్షంబు కురిసె.
ఇవ్విధంబుగా సకల దేవతా స్తోత్రంబులున్ కూర్చి
ఆది శంకరులు స్తోత్ర రాజముగా కనకధారా
స్తోత్రమును వర్ణించి, ఎవరు పారాయణమొనర్తురో వారికి
వారున్న రంగాన ధనమేగాక నానావిధాభివృధ్ధి చెందురనియెన్


ఇది పరమ గురుడు చెప్పిన మాట వినుకోరా పామరుడా



పోలూరు బాబురావు, నూజివీడు

1 కామెంట్‌: