ఓం శ్రీ విఘ్నేశ్వరాయై నమః
అజ్ఞానపు మేలి ముసుగు
తొలగనిదే మనిషికి
విజ్ఞాన బీజమంకురించి
తరుశాఖల ఫలాలనిచ్చి
సుజ్ఞానవంతునిగా మలచి
జీవనచక్ర వాహినిలో
అజ్ఞానాంధకార లంపటము వీడి
శాంతి సౌఖ్యముల పొందవలెనేని
ప్రాజ్ఞుడై విషయాసక్తుల
మోజులో దాగిన మనసును
ప్రజ్ఞతో నదుపుజేసి నిక్కంబగు
సత్యాన్వేషిగా కృషి సల్పవలె.
సంసార జలధిలో తాపత్రయాదులతో
సంకరమగు జీవన స్థితి గతులలో ఓలలాడి
సమ్పూరతమగు బాల కౌమార యవ్వన వృద్ధాప్యంబుల
దాటి మరణమాసన్నమగు వేళ
మంచిగ మనమున నారాయణుని తలపక
ముందర జరిగినదంతయు తన ప్రజ్ఞయని
అందరి కష్ట సుఖములు నరక స్వర్గములని
భ్రమించి బంధు జనులె తన ఆత్మీయులని
జీవనంబు గడిపెడువానికి మోక్షంబెలాగు లభించునయా!
బంధు ధర్మాలు సదా పాటించవలెనయా!
ఇది పరమ గురుడు చెప్పిన మాట వినుకోరా పామరుడా
తల్లి: సత్యం, సత్యస్వరూపం; తండ్రి: జ్ఞానం; భార్య: శాంతి;
సోదరుడు: ధర్మం; పుత్రుడు: ఓర్పు; స్నేహితుడు: దయ, మంచి హృదయం.
పోలూరు బాబురావు, నూజివీడు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి