భారతీ దేవి చేతి పుస్తక పుట శృతులనుండి
జాలువారి వేద భూములనుండి భారతాన
పలు భాషలు ఉద్భవింప అందు దేవ
భాషయగు సంస్కృతమే మిన్న కాగ
కాలగమనాన అన్నియు కనుమరుగగు చందాన
నేడది యల్ప సంఖ్యాక భాషయై దైవ భాషయయ్యే!
కాలానుగుణముగా ఉత్తర దక్షిణ హద్దులలో
ఆర్య, ద్రవిడ సంప్రదాయులు వేర్వేరు భాషల నేర్చి
వారి వారి అవసరాలకనుగుణముగ మార్చి
పలు విధ ప్రాంతేయ భాషా యజ్ఞానికి ఆజ్యమ్ముపోసి
ఆయా భాషల పాండిత్య పటిమ జూపి మేటి యైరి
అట్టి అత్యంత ప్రాచీన భాషయగు తెలుగు మాట్లాడ
క్రీస్తుకు మునుపె బుద్ధుని కాలములో
ఎందరో ప్రబుద్ధులు తెనుగు భాష పోషించే!
అటుల అమరావతి కుడ్యముపై 'నాగబు'
మూలమై తన ప్రాచీనతను చాటుచుండ
అమ్మయను పదము ఆంధ్రుల సొంతమై అలరారుచుండ,
జన్మభూమియందు పుట్టి గిట్టు వాడు
అమ్మయని అనక వేరోకగా పలుకునే!
అందుగల తెలుగుతనము మరుతుమే!
జాతి ప్రాచీనతను మార్తుమే!
ద్విసహస్రవత్సరపూర్వపాలకులగు శాతవాహనులు
తొట్టతొలి ఆంద్ర రాజులేగా!
వారి కాలాన్న వృద్ధి చేసిన ఆంధ్ర భాష
తదుపరి కాలాల వారు కవిత్వ భాషగా చేయలేదే!
దక్షిణాదిన పల్లవ రాజులు తేట తెలుగు తీపి తెలుపలేదే!
కన్నడిగుడైనను రాయలు తెలుగు కవితా గోష్టులు చేయలేదే!
దేశ భాషలందు పద్య కవిత్వావధానము తెలుగు భాషకే కలదని
సావధానముగ ఆలోచనము చేయవలయు.
అట్టి తెలుగు భాషను ప్రభుత్వ రాజ భాషగ చేయవలయు.
మనుజ జన్మంబెత్తిన ప్రతివారు మధురిమలు వొలుకు
తెలుగు భాష మాటలాడవలయు.
మాతృ భాషను మృత భాషగా చేయవలదు.
మూడు ప్రాంతాల వారి మువ్వన్నెల ముచ్చటైన
మన తెలుగు భాష అట్టి మాతృ భాషను పోషించి
మన సంస్కృతీ సంప్రదాయాలు ఎల్లరు పాటించవలయు.
అటుల అమ్మయను పదము పుట్టిన నాడే తెలుగుబుట్టె.
అమ్మ ప్రాచీనతాతనము లెక్కించ ఎవరి తరము?
తల్లి నాలుక అందరకు తలలో నాలుకై మెలగాలి.
భిన్న భాషతో తలో నాలుకగా విడివడరాదు.
జాలువారి వేద భూములనుండి భారతాన
పలు భాషలు ఉద్భవింప అందు దేవ
భాషయగు సంస్కృతమే మిన్న కాగ
కాలగమనాన అన్నియు కనుమరుగగు చందాన
నేడది యల్ప సంఖ్యాక భాషయై దైవ భాషయయ్యే!
కాలానుగుణముగా ఉత్తర దక్షిణ హద్దులలో
ఆర్య, ద్రవిడ సంప్రదాయులు వేర్వేరు భాషల నేర్చి
వారి వారి అవసరాలకనుగుణముగ మార్చి
పలు విధ ప్రాంతేయ భాషా యజ్ఞానికి ఆజ్యమ్ముపోసి
ఆయా భాషల పాండిత్య పటిమ జూపి మేటి యైరి
అట్టి అత్యంత ప్రాచీన భాషయగు తెలుగు మాట్లాడ
క్రీస్తుకు మునుపె బుద్ధుని కాలములో
ఎందరో ప్రబుద్ధులు తెనుగు భాష పోషించే!
అటుల అమరావతి కుడ్యముపై 'నాగబు'
మూలమై తన ప్రాచీనతను చాటుచుండ
అమ్మయను పదము ఆంధ్రుల సొంతమై అలరారుచుండ,
జన్మభూమియందు పుట్టి గిట్టు వాడు
అమ్మయని అనక వేరోకగా పలుకునే!
అందుగల తెలుగుతనము మరుతుమే!
జాతి ప్రాచీనతను మార్తుమే!
ద్విసహస్రవత్సరపూర్వపాలకులగు శాతవాహనులు
తొట్టతొలి ఆంద్ర రాజులేగా!
వారి కాలాన్న వృద్ధి చేసిన ఆంధ్ర భాష
తదుపరి కాలాల వారు కవిత్వ భాషగా చేయలేదే!
దక్షిణాదిన పల్లవ రాజులు తేట తెలుగు తీపి తెలుపలేదే!
కన్నడిగుడైనను రాయలు తెలుగు కవితా గోష్టులు చేయలేదే!
దేశ భాషలందు పద్య కవిత్వావధానము తెలుగు భాషకే కలదని
సావధానముగ ఆలోచనము చేయవలయు.
అట్టి తెలుగు భాషను ప్రభుత్వ రాజ భాషగ చేయవలయు.
మనుజ జన్మంబెత్తిన ప్రతివారు మధురిమలు వొలుకు
తెలుగు భాష మాటలాడవలయు.
మాతృ భాషను మృత భాషగా చేయవలదు.
మూడు ప్రాంతాల వారి మువ్వన్నెల ముచ్చటైన
మన తెలుగు భాష అట్టి మాతృ భాషను పోషించి
మన సంస్కృతీ సంప్రదాయాలు ఎల్లరు పాటించవలయు.
అటుల అమ్మయను పదము పుట్టిన నాడే తెలుగుబుట్టె.
అమ్మ ప్రాచీనతాతనము లెక్కించ ఎవరి తరము?
తల్లి నాలుక అందరకు తలలో నాలుకై మెలగాలి.
భిన్న భాషతో తలో నాలుకగా విడివడరాదు.
పోలూరు బాబురావు, నూజివీడు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి