ఎక్కడో అమెరికాలో పుట్టి
ఆనాడేనాడో భారతము మెట్టి
అటనుండి కృష్ణా తీరముంజేరి
పంతొమ్మిదివందల నాల్గులో
నాల్గు రూకలతో ఓ తల్లి నన్ను కొని
తన మనుమని జన్మ కానుకగా
పురుషోత్తమునకిచ్చి కాలలేమి
కొరత తీర్పంగ చేసారు నన్ను ఆజన్మ ఖైదీగా
అప్పటి నుండి ఆ యింటనే వుండి
అనుక్షణము కంటికి రెప్పగా
పోలూరి వారి కుటుంబం చూస్తూ
నాల్గు దశాబ్దాలు నాటి పెద్దయగు
బాపిరాజుకు మరి యిరువురు కుమార్లుతో
అన్యోన్య ఆత్మీయతకనువుగా
నూజివీడునందు నివసించుచూ
ఎల్లవేళలా ఆ కుటుంబ బాగోగులు చూస్తూ
ఒక్కొక్కపరి అందరూ పస్తులున్డుట
కూడా నేనురుగుదును. ఎటులనో కూడి
కూటికిన్ గుడ్డకున్ లోటు లేక
గడుస్తున్న ఒక దినము పెద్దాయన
తన జాతకము తానెరిగి నను జూచి
కాల నిర్ణయము జేసి, నేచూస్తుండగానే
అచేతనుడై పరుండి తన మువ్వురు
కుమారులు తనకు ఉత్తర క్రియలు
జరుపరేమోనని తలచి, బ్రతికుండగనే
యదార్ధ కర్మ జరిపించుకోవాలని తలచి
జీవధార కట్టించుకుని జీవ విముక్తిని
పొంది, మరణంబునొంది పవిత్రుడాయె.
ముగ్గురన్నదమ్ములలో మొదటివాడు
బ్రహ్మచారి కాగ మిగిలిన యిరువురు
శుభులై, సంసార జీవనులై పుత్రపుత్రికాదులతో
ఆ ఇల్లు కళకళలాడుచుండంగ
ప్రతి సంవత్సరమొక బారసాలయో
వివాహమో జరుగుచూ మూడు పూవులు
ఆరు కాయలన్నట్లు జరుగుచుండే.
ఇంటి మధ్య గోడకు నేనుండి అందరకు
సమయంబందిన్చుదాననై యింటి వారికే
కాక పేటవాసులకు కూడా టైము
తెలిపెడుదాననై ఘంటానినాదంబు
కూడ అలుపెరగక సల్పినాను.
శాస్త్రులు టైము చూచుటకు వస్తే
పిల్లలందరూ తలుపు మూసి నను దాచి
నన్ను చూడ నిచ్చేడి వారు కాదు.
నాకు దృష్టి తగులుతుందని కాబోలు!
అతుల అభిమానించిన ఆ పిల్లలను
వాకిట ఆటలాడుకొనుచుంటే
కనులారంగ చూచుకొనేదానను.
అప్పుడప్పుడు నాకింత 'కీ' యిచ్చి
నన్ను పని చేయించి నా చేయూత
పొందేటి ఆ కుటుంబ స్నేహమునేనెలా
మరువగలను.
అచ్చొచ్చినదాననని ఒక చోటనే యుంచి
గోడ కచ్చోట అచ్చు పడునట్లుగా
యుంచి అందరూ ఆప్యాయతగా చూచినారు.
అటుల కాలచక్ర బంధముతో
శుభాశుభ మిశ్రమాల పరిభ్రమణంలో
ఎన్నెన్ని సంఘటనలో చూచినాను.
కలతలు, కక్షలు, కార్పణ్యాలతో
కొన్ని ఘటనలతో కలత చెంది,
నాకు స్తానభ్రంశము కలుగు సమయాన
నా హృదయ స్పందనమాగి మూగబోయి
పాత గూడు మారి కొత్త గూటికి చేరి
నను కాన్కగా పొందిన యజమాని
దత్తుకు చేరి వారింటి కష్ట సుఖాలలో
మమేకమై జీవన ప్రక్రియ సాగుతుండ
తొంభై దశకములో పగలంత నాకు
తోడుగా 'చింటు'తో కాలక్షేపము చేయ
నేగంట కొట్టినప్పుడెల్ల అది వులికిపడగా
నా నోరు నొక్కుకుని నే మ్రోగుటాపినాను.
అటుల పదునాల్గు వత్సరములు గడువ
ఒక స్వాతంత్ర దినముందు రోజు
'చింటు తల్లి' ఉదయాన నే చూస్తుండ
కనుమూసి కనుమరుగై కంట తడి
నింపి కానరాని దూరతీరాలకేగి
నా శతవర్షసంవత్సరాన నాకు
క్షోభ కల్గించి తాననంత కాలవాహినిలో
చిరాయువయ్యింది.
నాకెప్పటికో మోక్ష ప్రాప్తి. నేనెరుగ
నీకాలమహిమ.
ఆనాడేనాడో భారతము మెట్టి
అటనుండి కృష్ణా తీరముంజేరి
పంతొమ్మిదివందల నాల్గులో
నాల్గు రూకలతో ఓ తల్లి నన్ను కొని
తన మనుమని జన్మ కానుకగా
పురుషోత్తమునకిచ్చి కాలలేమి
కొరత తీర్పంగ చేసారు నన్ను ఆజన్మ ఖైదీగా
అప్పటి నుండి ఆ యింటనే వుండి
అనుక్షణము కంటికి రెప్పగా
పోలూరి వారి కుటుంబం చూస్తూ
నాల్గు దశాబ్దాలు నాటి పెద్దయగు
బాపిరాజుకు మరి యిరువురు కుమార్లుతో
అన్యోన్య ఆత్మీయతకనువుగా
నూజివీడునందు నివసించుచూ
ఎల్లవేళలా ఆ కుటుంబ బాగోగులు చూస్తూ
ఒక్కొక్కపరి అందరూ పస్తులున్డుట
కూడా నేనురుగుదును. ఎటులనో కూడి
కూటికిన్ గుడ్డకున్ లోటు లేక
గడుస్తున్న ఒక దినము పెద్దాయన
తన జాతకము తానెరిగి నను జూచి
కాల నిర్ణయము జేసి, నేచూస్తుండగానే
అచేతనుడై పరుండి తన మువ్వురు
కుమారులు తనకు ఉత్తర క్రియలు
జరుపరేమోనని తలచి, బ్రతికుండగనే
యదార్ధ కర్మ జరిపించుకోవాలని తలచి
జీవధార కట్టించుకుని జీవ విముక్తిని
పొంది, మరణంబునొంది పవిత్రుడాయె.
ముగ్గురన్నదమ్ములలో మొదటివాడు
బ్రహ్మచారి కాగ మిగిలిన యిరువురు
శుభులై, సంసార జీవనులై పుత్రపుత్రికాదులతో
ఆ ఇల్లు కళకళలాడుచుండంగ
ప్రతి సంవత్సరమొక బారసాలయో
వివాహమో జరుగుచూ మూడు పూవులు
ఆరు కాయలన్నట్లు జరుగుచుండే.
ఇంటి మధ్య గోడకు నేనుండి అందరకు
సమయంబందిన్చుదాననై యింటి వారికే
కాక పేటవాసులకు కూడా టైము
తెలిపెడుదాననై ఘంటానినాదంబు
కూడ అలుపెరగక సల్పినాను.
శాస్త్రులు టైము చూచుటకు వస్తే
పిల్లలందరూ తలుపు మూసి నను దాచి
నన్ను చూడ నిచ్చేడి వారు కాదు.
నాకు దృష్టి తగులుతుందని కాబోలు!
అతుల అభిమానించిన ఆ పిల్లలను
వాకిట ఆటలాడుకొనుచుంటే
కనులారంగ చూచుకొనేదానను.
అప్పుడప్పుడు నాకింత 'కీ' యిచ్చి
నన్ను పని చేయించి నా చేయూత
పొందేటి ఆ కుటుంబ స్నేహమునేనెలా
మరువగలను.
అచ్చొచ్చినదాననని ఒక చోటనే యుంచి
గోడ కచ్చోట అచ్చు పడునట్లుగా
యుంచి అందరూ ఆప్యాయతగా చూచినారు.
అటుల కాలచక్ర బంధముతో
శుభాశుభ మిశ్రమాల పరిభ్రమణంలో
ఎన్నెన్ని సంఘటనలో చూచినాను.
కలతలు, కక్షలు, కార్పణ్యాలతో
కొన్ని ఘటనలతో కలత చెంది,
నాకు స్తానభ్రంశము కలుగు సమయాన
నా హృదయ స్పందనమాగి మూగబోయి
పాత గూడు మారి కొత్త గూటికి చేరి
నను కాన్కగా పొందిన యజమాని
దత్తుకు చేరి వారింటి కష్ట సుఖాలలో
మమేకమై జీవన ప్రక్రియ సాగుతుండ
తొంభై దశకములో పగలంత నాకు
తోడుగా 'చింటు'తో కాలక్షేపము చేయ
నేగంట కొట్టినప్పుడెల్ల అది వులికిపడగా
నా నోరు నొక్కుకుని నే మ్రోగుటాపినాను.
అటుల పదునాల్గు వత్సరములు గడువ
ఒక స్వాతంత్ర దినముందు రోజు
'చింటు తల్లి' ఉదయాన నే చూస్తుండ
కనుమూసి కనుమరుగై కంట తడి
నింపి కానరాని దూరతీరాలకేగి
నా శతవర్షసంవత్సరాన నాకు
క్షోభ కల్గించి తాననంత కాలవాహినిలో
చిరాయువయ్యింది.
నాకెప్పటికో మోక్ష ప్రాప్తి. నేనెరుగ
నీకాలమహిమ.
పోలూరు బాబురావు, నూజివీడు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి